NANDYAL May 01:- ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నాయకులను,సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులతో వేధిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగామాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జనవరి 31న జరిగిన ఒక ఘటనపై తనపై ఏకంగా 32 కేసులు నమోదు చేశారని, తాజాగా పులివెందుల, వేంపల్లిలో మరిన్ని కేసులు పెట్టారని అంబటి తెలిపారు. వైసిపి మీడియా ఇన్చార్జి పూడి శ్రీహరి విషయంలో కోర్టు బెయిల్ ఇచ్చినా, మళ్లీ ఇతర ప్రాంతాల్లో అరెస్టులు చూపిస్తూ మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆరోపించారు. “ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. పోలీసు అధికారులు కొందరు రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందని,అప్పుడు చట్టపరమైన పరిణామాలు ఉంటాయని సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం చెందిందన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరికి పాల్పడుతున్నదని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు తామే చేశామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి ఐనా ప్రజలకు చేసిన మంచి ఏమీలేదని, కేవలం వైసిపి నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. V. రాజేంద్ర కుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai