NANDYAL july 23:- 26గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు.. దాతల సహకారంతో భక్తుల ఆదరణతో శిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ పలు అభివృద్ధి కార్యక్రమాల కు శ్రీకారంచుట్టారు.ఈనెల 29వ తేదీ బుధవారం పౌర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నాగులకుంట రోడ్ లో ఉన్న శిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. సకాలంలో వర్షాలు కురవాలని సాయిబాబాకు సహస్ర కలసాభిషేకం నిర్వహించారు.. కలసాభిషేకం అనంతరం స్వామివారికి ప్రత్యేకమైన అలంకరణ అనంతరం అర్చనలు నిర్వహించి గురుపౌర్ణిమ వేడుకల కరపత్రాలు విడుదల చేశారు.

దేవస్థాన ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బలుసా అరవింద ప్రసాద్ సెక్రెటరీ కులాయి బాబు ట్రెజరర్ తూనుగుంట్ల సోమశేఖర్ దేవస్థానం కమిటీ పెద్దలు చిన్నపరెడ్డి కందుకూరి శ్రీరామ్మూర్తి ఉమామహేశ్వరరావు కైలాసనాద్ రెడ్డి సుబ్బరామయ్య నాగరాజు పసుపులేటి జనార్ధన్ ఇతర పెద్దలు పాల్గొన్నారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ప్రజలు పశువులు తదితర జీవరాసుల కు త్రాగునీరు సాగునీరు కు ఇబ్బంది కలవకూడదని., వేదపండితుల సూచనల మేరకు బాబా వారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించామని అలాగే 29వ తేదీన గురు పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు షిరిడి సాయిబాబా దేవస్థానంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు

గురు పౌర్ణమి రోజు పూజలో పాల్గొనదలచిన భక్తులు దంపతులకు 2500 చెల్లించాలని . పౌర్ణమి రోజు బాబా వారికి పుష్ప అలంకరణ బంగారు సింహాసనం మకరతోర్ణంతో అలంకరణ విష్ణు సహస్రనామ పారాయణ కాకడ హారతి మధ్యాహ్నం సాయం సంధ్య హారతి రాత్రి పల్లకి సేవ అనంతరం హారతి ఉంటుందని ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందాలని కోరారు.. 26వ పౌర్ణమి వేడుకలకు మంత్రి ఫరూక్ మరియు ఎంపీ అలాగే ఇతర ఉన్నతాధికారుల ను ఇతర అనధికారులను పెద్దలను ఆహ్వానిస్తామని తెలిపారు.
1999లో అప్పటి కౌన్సిల్ సాయిబాబా దేవస్థానానికి స్థలం కేటాయించడంతో మంత్రి ఫారుక్ చొరవతో దేవస్థానం నిర్మించడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు దాతలు భక్తులు సహకరిస్తూ వచ్చారని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 25వ తేదీ అనగా శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి బాబా వారి గ్రామోత్సవం ఉంటుందని ప్రజలు పాల్గొని విజయంతం చేయాలని కోరారు..c.v. చలం బాబు ఎలక్ట్రాన్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు నంద్యాల జిల్లా
Arattai