NANDYAL July26 :- నంద్యాల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగనాయకులు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కర్నూలు–నంద్యాల జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి లీల వెంకట శేషాద్రి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం విశేష సేవలందించిన మాజీ సైనికుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ సైనికులకు న్యాయపరమైన సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని, వారికి చట్టపరమైన సహాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవాన్లకు కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. మాజీ సైనికులు, సంఘం ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Arattai