NANDYAL June22 :- రాష్ట్రవ్యాప్తంగా శుభ్రమైన నాణ్యమైన ఆహారం పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ సోమవారం జనతా వారధి సభ్యులు,జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ పాలు,నకిలీ,మసాలాలు,నాసిరకం ప్యాకేజ్డ్ ఫుడ్,అపరిశుభ్ర మాంసం విక్రయాలు,నాణ్యతలేని ప్యాకేజ్డ్ వాటర్ వంటి సమస్యలు విస్తృతంగా కనిపిస్తున్నాయని,ఇవి ప్రజారోగ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతున్నాయని వారు తెలిపారు

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదుల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో ఒకటి — కల్తీ ఆహారం మరియు ఆహార భద్రత సంక్షోభం.
ప్రజలు తీసుకునే ఆహారం సురక్షితం కాకపోతే, అది కేవలం ఆరోగ్యానికే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వైద్య ఖర్చులు పెరిగి, సాధారణ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ పాలు, నకిలీ మసాలాలు, నాసిరకం ప్యాకేజ్డ్ ఫుడ్, అపరిశుభ్ర మాంసం విక్రయాలు, నాణ్యతలేని ప్యాకేజ్డ్ వాటర్ వంటి సమస్యలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇవి ప్రజారోగ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతున్నాయి.

ఆహార భద్రత అమలులో సిబ్బంది కొరత కూడా తీవ్రమైన సమస్యగా ఉంది. FSSAI ప్రమాణాల ప్రకారం రాష్ట్రానికి అవసరమైన Food Safety Officers సంఖ్యతో పోలిస్తే భారీ కొరత ఉంది. మొత్తం 723 పోస్టులు మంజూరై ఉండగా, కేవలం 144 మంది మాత్రమే విధుల్లో ఉండటం, 500కు పైగా పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళనకరం. ఇటువంటి పరిస్థితుల్లో కోట్లాది ప్రజల ఆహార భద్రతను సమర్థంగా పర్యవేక్షించడం కష్టసాధ్యం. 2023–2026 మధ్య పరీక్షించిన 16,700 ఫుడ్ శాంపిల్స్లో సుమారు 1,400 కల్తీ నమూనాలు గుర్తించబడినట్లు సమాచారం. ఇది సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది.
ఇటీవలి సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కుదిపేసిన కొన్ని ప్రధాన సంఘటనలు మీరు గమనించాలి. రాజమహేంద్రవరం కల్తీ పాలు ఘటన — కలుషిత పాలు సేవించడం వల్ల పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురికావడం. Ethylene Glycol వంటి ప్రమాదకర రసాయనాల అనుమానం వెలుగులోకి వచ్చింది. ఏలూరు నీటి కాలుష్య సంక్షోభం — కలుషిత నీటి కారణంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళం డయేరియా వ్యాప్తి – కలుషిత తాగునీటి కారణంగా డయేరియా, గ్యాస్ట్రో కేసులు పెరిగాయి. తిరుమల లడ్డు వ్యవహారం — SIT దర్యాప్తులో కల్తీ నెయ్యి సరఫరాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో పాడైన మాంసం రాకెట్లు — నిల్వ మాంసం, rotten chicken, synthetic food colours వినియోగం బయటపడింది. అనకాపల్లి హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ — కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గంటప్రభుత్వం ఆహార నాణ్యత పరిరక్షణ విభాగాన్ని విస్మరించిన కారణంగా దాని ఫలితాలు చూస్తున్నాం. ఇప్పటికే ఈ విషయంలో పురోగతి లేకుండావుందని వారు తెలిపారు
Arattai